Saturday, April 27, 2024

రేపు సాయంత్రం ఇంటర్ సెకండియర్ ఫలితాలు

ఏపీలో ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఆప్షన్‌ ఇచ్చారు. పదో తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌లో సాధించిన మార్కులను ఆధారంగా చేసుకుని ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు.

కాగా కరోనా నేపథ్యంలో తొలుత ఏపీ ప్రభుత్వం చివరి క్షణం వరకు పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతోనే ముందుకుసాగింది. కానీ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పరీక్షలను రద్దు చేసింది. జులై 31లోపు పరీక్షా ఫలితాలను ప్రకటించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు.. అంతలోపు పరీక్షలను నిర్వహించి, ఫలితాలను విడుదల చేయడం అసాధ్యమని భావించిన ఏపీ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది.

ఈ వార్త కూడా చదవండి: సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న ఏపీ సర్కారు

Advertisement

తాజా వార్తలు

Advertisement