Thursday, April 25, 2024

వీడియో: టీఆర్ఎస్ మంత్రులు ఎర్రబెల్లి, సబితాలకు నిరసన సెగ

రంగారెడ్డి జిల్లా కొందుర్గులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిని నిరుద్యోగులు నిలదీశారు. వాళ్ల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని తమను మోసం చేశారని నిరుద్యోగులు ఆరోపించారు. ఈ మేరకు బీజేవైఎం కార్యకర్తలతో కలిసి నిరుద్యోగులు మంత్రుల కార్లను అడ్డగించారు. ఉద్యోగాల హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లాలో స్థానికంగా ఉన్న రోడ్ల దుస్థితిపైనా మంత్రులను నిలదీశారు. నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాగా మంత్రులను నిరుద్యోగులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేవైఎం కార్యకర్తలతో పాటు నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ వార్త కూడా చదవండి: రాజ్‌భవన్‌లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

Advertisement

తాజా వార్తలు

Advertisement