హైదరాబాద్, ఆంధ్రప్రభ : రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ పరీక్షలు భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ నెల 16 నుంచి పీజీ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. వర్షాల కారణంగా వరుస సెలవులు ప్రకటించడంతోపాటు విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు రవాణా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమైన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. పీ. వెంకటరమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 18 నుంచి పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే హాల్ టికెట్లను యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న వారు మరోమారు అదే వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.