Thursday, May 9, 2024

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఎదురుదెబ్బ

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కాలి గాయంతో సిరీస్‌ నుంచి అర్దంతరంగా వైదొలగగా, బుధవారం స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఈ జాబితాలో యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. టీమిండియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్‌ ఎలెవెన్‌ తరఫున బరిలోకి దిగిన సుందర్‌.. గురువారం ఆటలో గాయపడ్డాడు.

సుందర్ చేతి వేలికి గాయమైందని, అయితే గాయం తీవ్రతపై స్పష్టత లేదని తెలుస్తోంది. స్కానింగ్‌ తీసిన తర్వాతే గాయంపై క్లారిటీ వస్తుందని జట్టు అధికారులు వెల్లడించారు. గాయంతో సుందర్‌ పడుతున్న ఇబ్బంది చూస్తే వేలు విరిగినట్లు ఉందని తెలుస్తోంది. కాగా ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్, భారత్ మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది.

ఈ వార్త కూడా చదవండి: ఇండియాతో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక

Advertisement

తాజా వార్తలు

Advertisement