Tuesday, April 23, 2024

ఇండియాతో టెస్ట్ సిరీస్..ఇంగ్లండ్ జట్టు ఇదే

టీమిండియాతో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్టును ప్రకటించింది. ఆగష్టు 4 నుంచి నాటింగ్‌హాంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి రెండు టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను ఈసీబీ బుధవారం వెల్లడించింది. సుదీర్ఘ విరామం తర్వాత హసీబ్‌ హమీద్‌ ఇంగ్లండ్‌ జట్టుతో చేరనున్నాడు. ఓ వైపు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు లంకతో వన్డే మ్యాచ్ ఆడుతుంటే, ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న భారత జట్టు కౌంటీ ఎలెవన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది…భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు, వైస్ కెప్టెన్ అజింకా రహానే కూడా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడం లేదు. దాంతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ గా వ్యవహరిస్తున్నాడు.

ఇంగ్లండ్ జట్టు: జో రూట్‌(కెప్టెన్‌), జేమ్స్‌ ఆండర్సన్‌, జానీ బెయిర్‌స్టో, డామ్‌ బెస్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, రోరీ బర్న్స్‌, జోస్‌ బట్లర్‌, జాక్‌ చావ్లే, సామ్‌ కరన్‌, హసీబ్‌ హమీద్‌, డాన్‌ లారెన్స్‌, జాక్‌ లీచ్‌, ఓలీ పోప్‌, ఓలీ రాబిన్‌సన్‌, డామ్‌ సిబ్లీ, బెన్‌ స్టోక్స్‌, మార్క్‌ వుడ్‌.

ఇది కూడా చదవండి: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కరీంనగర్ లో కేసు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement