Tuesday, April 30, 2024

శ్రీవారి భక్తులకు గమనిక.. రెండు నెలల పాటు అలిపిరి కాలిబాట బంద్

తిరుపతిలోని అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే కాలిబాటను రెండు నెలల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. నూతన పైకప్పు నిర్మాణం, ఇతర మరమ్మతుల కారణంగా జూన్ 1 నుంచి జూలై 31 వరకు అలిపిరి కాలిబాట మూసివేస్తామని తెలిపింది. కాలిబాట ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు శ్రీనివాస మంగాపురం వద్ద ఉండే శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లాలని టీటీడీ సూచించింది. అలిపిరి నుంచి శ్రీవారి మెట్ల మార్గానికి ఉచిత బస్సులు ఏర్పాటు చేశామని టీటీడీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement