Thursday, April 25, 2024

వ్యవసాయి చట్టాలు రద్దు చేయాలంటూ జగ్గారెడ్డి నిరసన

రైతుకు నష్టం చేసే మూడు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలపి సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభత్వం తీసుకొచ్చిన చట్టలతో రైతులు  ఆర్ధికంగా నష్టపోతారని చెప్పారు. ఈ చట్టాలు అమలైతే రైతు పండించిన పంట స్వయంగా అమ్ముకునే పరిస్థితి ఉండదన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభత్వం పై రాష్ట్ర ప్రభత్వం ఒత్తిడి చేయాలని కోరారు. సంగారెడ్డి ,తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన రైతు సంఘాలు పిలుపుకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ తన నిరసన వ్యక్తం చేస్తున్నానని జగ్గారెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement