Thursday, May 2, 2024

రాగులు, జొన్నల పంపిణీకి చర్యలు !

అమరావతి, ఆంధ్రప్రభ : చౌకదుకాణాల ద్వారా రాగులు, జొన్నలు కార్డుదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉచిత బియ్యం స్థానే జొన్నలు, రాగులు తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారా లేదా అని వలంటీర్ల ద్వారా కార్డుదారుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

వీటిని వలంటీర్ల నుంచి డీలర్లు సేకరించి, వారి పరిధిలో వారికి అవసరం ఉందా లేదా అనే అంశాలపై ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖ విల్లింగ్‌ లెటర్స్‌ తీసుకుంటోంది. ఈ ప్రక్రియ ముగిశాక రాగులు, జొన్నలు ఇవ్వనున్నారు. రాగులు, జొన్నలు కిలో వంతున తీసుకుంటే బియ్యంలో రెండు కిలోల మినహాయింపు ఉంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement