Thursday, May 9, 2024

మేడారం వెళ్తుండగా యాక్సిడెంట్.. పలువురికి తీవ్ర గాయాలు

గోవిందరావుపేట/తాడ్వాయి (ప్రభ న్యూస్) హైదరాబాదు నుండి మేడారం దర్శనానికి వస్తున్న ఫార్చునర్ కారు ఉదయం 5 గంటల సమయంలో పసర, తాడువాయి మధ్యలో గల మొండెల తోగు అటవీ ప్రాంతంలో చెట్టును ఢీకొట్టి ప్రమాదానికి గురి అయింది.

అందులో ప్రయాణిస్తున్న బాలమని అనే మహిళకు తలకు గాయం కావ‌డంతో తీవ్ర రక్తస్రావం జరిగి తుది శ్వాసలో ఉంది. 108 ఫోన్ చేయగా తాడ్వాయి అంబులెన్సు ఈఎంటి విజేందర్, పైలట్ సతీష్ , స్పందించి సిపిఆర్ చేస్తూ వాళ్ళను చికిత్స కొసం ములుగు ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement