Friday, April 26, 2024

Accident – లోయలో పడ్డ బస్సు – 45 మంది మృతి

జొహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. దీంతో 45 మంది అక్కడికక్కడే మరణించారు. అయితే 8 ఏండ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్‌ పండుగ నేపథ్యంలో చర్చికి వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. 165 అడుగుల లోతులో పడిపోవడంతో బస్సులో మంటలు అంటుకున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. వారంతా బోట్స్‌వానా నుంచి మోరియోకు వెళ్తున్నారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement