Wednesday, May 15, 2024

Accident – ట్రాక్ట‌ర్ ట్రాలీని ఢీకొట్టిన గూడ్స్ రైలు – ఆరుగురికి గాయాలు..

లక్నో: ఒక గూడ్స్‌ రైలు ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ ట్రాలీలో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున బన్సీ పహర్‌పూర్ – రుబ్బాస్ ప్రాంతంలోని రైలు గేటు వద్ద ట్రాలీ ఉన్న ట్రాక్టర్‌ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో అటుగా వచ్చిన గూడ్స్‌ రైలు దానిని ఢీకొట్టింది.

ఈ సంఘటనలో రైలు ఇంజిన్‌ వెనుక ఉన్న గూడ్స్‌ వ్యాగన్‌ పట్టాలు తప్పింది. కాగా, ఈ ప్రమాదం వల్ల ట్రాక్టర్‌ ట్రాలీలో ఉన్న ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్‌ సంఘటనా స్థలానికి చేరినట్లు పేర్కొన్నారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement