Saturday, April 27, 2024

Breaking: జమ్మికుంట తహసీల్దార్ ఇంటిపై ఏసీబీ దాడులు..

ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ ఏసీబీ అధికారులు జమ్మికుంట తహసీల్దార్ రజని ఇంట్లో సోదాలు చేపడుతున్నారు. ఈ మేరకు పట్టణంలో ఆమె ఇంట్లో ప్రస్తుతం రెయిడ్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న రజని దగ్గర బంధువుల ఇళ్లలో కూడా ఏక కాలంలో సోదాలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు ఎంత డబ్బును కనుగొన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement