Friday, May 3, 2024

‘ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు’ మేకింగ్ వీడియో

కిశోర్ తిరుమ‌ల రూపొందిస్తోన్న చిత్రం ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు. ఈ చిత్రంలో శర్వానంద్ – రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి వంటి సీనియర్ నటీమణులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన థియేటర్లకు తీసుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఎక్కువమంది ఆడవాళ్లే కావడం వలన సెట్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేదనీ .. ఒక పిక్నిక్ కి వెళ్లి వచ్చినట్టుగా షూటింగుకి వెళ్లొచ్చానని రష్మిక చెప్పింది. ప్రతి రోజు ఎంతో సరదాగా .. సందడిగా గడిచిందని తెలిపింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement