Friday, April 19, 2024

ఏపీ మంత్రి అప్ప‌ల‌రాజుకు అద‌న‌పు బాధ్య‌త‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్నందున దివంగత గౌతమ్ రెడ్డి శాఖలపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి శాఖలను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు అప్పగించారు. ఈ మేరకు సీఎంఓ ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, స్కిల్ డెవలప్ మెండ్ అండ్ ట్రైనింగ్ శాఖల బాధ్యతలను అసెంబ్లీలో సీదిరి అప్పల రాజు సమాధానం చెబుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement