Monday, May 6, 2024

సోనీ లివ్ ఓటీటీలో ఆడ‌వాళ్లు మీకు జోహార్లు స్ట్రీమింగ్‌..

తిరుమల కిషోర్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఇందులో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.

కాగా, ఈ ఫ్యామిలీ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను తాజాగా ప్రకటించారు మూవీ టీమ్. సోనీ లివ్ ప్లాట్‌ ఫారమ్‌లో ఏప్రిల్ 14 నుండి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ప్రకటించారు. మరి ఓటీటీ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement