Sunday, April 28, 2024

భ‌ట్టి పాద‌యాత్ర‌కు తాత్కాలిక బ్రేక్‌.. ఢిల్లీకి రావాల‌ని రాహుల్ పిలుపు

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు బ్రేక్ ప‌డ‌నుంది. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తో ఈ నెల 4న అత్యవసర సమావేశం ఉన్నందున ఆదివారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేశారు. భ‌ట్టీని అర్జంటుగా ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ నుంచి లేఖ రావడంతో భట్టి విక్రమార్క తన పాదయాత్రను వాయిదా వేసుకొని ఢిల్లీ వెళ్తున్నారు. ఈ కారణంగా బోనకల్లు మండలంలో నిర్వహించే పాదయాత్రను ఆదివారం నుంచి వాయిదా వేస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధిష్టానంతో భేటీ త‌ర్వాత ఢిల్లీ నుంచి నేరుగా బోనకల్ కు చేరుకొని భ‌ట్టీ త‌న పాదయాత్రను కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement