Friday, May 3, 2024

పతివ్రత అని నిరూపించుకో…భార్య కు నరకం చూపించిన భర్త

దేశంలో మహిళలపై రోజురోజుకీ ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు రోడ్డుపై వెళ్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే… మరికొంతమంది కట్టుకున్న భార్యను కూడా అనుమానంతో తో కాల్చుకుతింటున్నారు. తాజాగా ఓ నీచుడు కట్టుకున్న భార్యకు నరకం చూపించాడు. పాతివ్రత్యానికే పరీక్ష పెట్టేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు ఆమె జననేంద్రియాలకు ఏకంగా కుట్లు వేశాడు.

వివరాల్లోకి వెళితే రాంపూర్ లో మిలక్ ఏరియా కి చెందిన ఓ వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే అతను నిత్యం తన భార్య వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకుందని గొడవ పడుతూ ఉండేవాడు. ఒక రోజు ఆమె పాతివ్రత్యానికి పరీక్ష పేరుతో అత్యంత పాశవికంగా దారుణానికి పాల్పడ్డాడు. పరీక్ష పేరుతో ఆమె కాళ్లు చేతులు కట్టేసి అల్యూమినియం తీగతో జననేంద్రియాలకు కుట్లు వేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ తర్వాత భార్య తన తల్లికి విషయం చెప్పడంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అతనికి పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఈ ఘటనను చూసిన డాక్టర్లు సైతం చలించిపోయారు. నిజాయితీకి పరీక్ష అని చెప్పి ఈ విధంగా చేశాడని భార్య వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement