Wednesday, May 15, 2024

పగబట్టిన నాగు, ఒకే ఊళ్లో ఐదుగురికి కాటు.. చికిత్స పొందుతూనే మృతి

తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్​లో నాగుపాము పగబట్టినట్టుంది. ఈ జిల్లాలో రెండు రోజుల్లోనూ ఐదుగురిని కాటేసింది. దీంతో వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. తిరువారూర్ జిల్లాలో రెండు రోజుల్లో పాము కాటుకు తిరుచెట్టంగుడి ప్రాంతానికి చెందిన రవి, దైవనాయకి, రవి, వీరమణి, విజయేంద్రన్‌ చనిపోయారు.

పాముకాటుకు గురైన వీరు తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాలలోని  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 48 గంటల్లోనే మృతిచెందారు. అయితే.. ఈ జిల్లాను అంతా వ్యవసాయ జిల్లాగా పిలుస్తారు. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతంలో విషపూరిత పాముల సంఖ్య పెరిగిందని రైతులు చెబుతున్నారు.అంతేకాకుండాభారీ వర్షాలు, విద్యుత్తు అంతరాయాలతో కూడా పాము కాటు ఘటనలు ఎక్కువయ్యాయంటున్నారు స్థానికులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement