Sunday, April 28, 2024

బాత్ రూమ్ లో గొంతు కోసుకున్న విద్యార్థి…కారణం అదేనా ?

ఇటీవల కాలంలో యువతి, యువకులు ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య, పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్య… ఇలా ప్రతి విషయంలోనూ చావే సొల్యూషన్ గా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కుప్పం ఇంజనీరింగ్ కళాశాలలో బిఎస్సి నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చిత్తూరు జిల్లా రామచంద్రపురంకు చెందిన యద్దల పావని బాత్ రూమ్ లో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

పరిస్థితి విషమం, చికిత్స నిమిత్తం కుప్పం పిఇఎస్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement