Friday, April 19, 2024

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ-ఒకరు మృతి

వలేటివారిపాలెం: రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలని అంకగోపాలపురం-కట్లమ్మపాలెం మార్గమద్యంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ ఘటనలో సిఎస్‌పురం మండలం అడవిలో పల్లి గ్రామానికి చెందిన కొమ్మి మాలకొండయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి సమీపాన గొర్రెల కాపరులు గమనించి చూడగా అప్పటికే ఒకరు మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే 108 వాహనమునకు సమాచారం ఇవ్వగా 108 సిబ్బంది పరిశీలించగా అప్పటికే ఒకరు మృతిచెందినట్లు తెలిపారు. స్వల్పగాయాలైన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే వలేటివారిపాలెం ఎస్సై అజరత్తయ్య సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్ళినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement