Sunday, May 19, 2024

IPL | ముంబై ముందు భారీ టార్గెట్..

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న పోరులో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ రెచ్చిపోయారు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ ను కకావికలం చేశారు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుబ్ మన్ గిల్ (34 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో చెలరేగిపోయాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (22 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), అభినవ్ మనోహర్ (21 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. దీంతో ముంబయి ఇండియన్స్‌ ముందు భారీ టార్గెట్‌ను ఉంచింది గుజరాత్ టైటాన్స్. 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement