Monday, May 6, 2024

ఎప్‌ సెట్‌లో 94.25 శాతం హాజరు నమోదు

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎప్‌ సెట్‌- 2022 ఈ రోజు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా నిర్వహించినట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొ.బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. మూడో రోజు రాష్ట్రవ్యాప్తంగా రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షలకు 94.25 శాతం మంది హాజరైనట్లు వెల్లడించారు.

ఉదయం సెషన్‌కు 20 వేల 738 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 19 వేల 419 మంది(93.64 శాతం), మధ్యాహ్నం సెషన్‌కు 20 వేల 431 మందికి 19 వేల 382 మంది(94.87 శాతం) హాజరయ్యారు. మొత్తంగా 41 వేల 169 మందికి 38 వేల 801 మంది హాజరయ్యారని, హాజరు శాతం 94.25 శాతంగా ఉందని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement