Thursday, May 9, 2024

నేపాల్ లో లోయ‌లో ప‌డ్డ బ‌స్సు ….ఏడుగురు దుర్మ‌ర‌ణం..

నేపాల్ లోని బారా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరింది. భారత యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు గురువారం తెల్లవారుజామున లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయులుతో పాటు మరొకరు నేపాల్ కు చెందిన వ్యక్తి మరణించారు. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

భారతీయ యాత్రికులతో కూడిన బస్సు ఖాట్మండు నుంచి జనక్ పూర్ వెళ్తుండగా బారాలోని చురియామై సమీపంలో తెల్లవారు జామున 2 గంటల సమయంలో 50 మీటర్ల లోయలో పడిపోయింది. మృతుల్లో మహోత్తరి జిల్లా లోహర్ పట్టికి చెందిన ఒక నేపాలీ, రాజస్థాన్ కు చెందిన ఆరుగురు భారతీయులు ఉన్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సులో డ్రైవర్లు, ఒక హెల్పర్ సహా మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రదీప్ బహదూర్ ఛెత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement