Friday, April 26, 2024

దేశంలో ఇప్పటివరకు 41 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు పంపిణీ..

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ స్థిరంగా కొనసాగుతోంది. థర్డ్ వేమ్ ముంచుకొస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు, వైద్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. డిసెంబర్ వరకు వంద కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఇప్పటి వరకు 41,76,56,752 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2.88 కోట్ల మోతాదులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఇప్పటి వరకు 43,25,17,330 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు వివరించింది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 187వ రోజుకు చేరగా.. ఒకే రోజు 20,83,892 వ్యాక్సిన్ మోతాదులను అందించారు. ఇందులో 10,04,581 మొదటి మొతాదులు కాగా.. 95,964 మందికి రెండో డోసు వేశారు. 18-44 ఏజ్‌ గ్రూప్‌లో 13,04,46,413 మంది వారి మొదటి.. మరో 53,17,567 మందికి రెండో మోతాదు అందజేసినట్లు వివరించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు 18-44 ఏజ్‌ గ్రూప్‌లో కోటికిపైగా మోతాదులు వేశాయని చెప్పింది.

ఇది కూడా చదవండి : కరోనా రోగి నుంచి వీర్యాన్ని తీసిన వైద్యులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement