Saturday, April 27, 2024

కృష్ణమ్మ పరవళ్లు.. సంగమేశ్వర ఆలయాన్ని తాకిన వరద నీరు

సప్తనదీ సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం, కొత్తపల్లి మండలంలో వెలసిన సప్త నదుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జలాలు చుట్టు ముట్టాయి. దీంతో సంగమతీరం సంద్రాన్ని తలపిస్తోంది. గత వారం రోజులుగా వరద పోటెత్తడంతో సంగమేశ్వరం వద్ద ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు సంగమేశ్వరం జల వారధి కావడంతో  ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ బుధవారం ఉదయం అంత్య పూజలు నిర్వహించారు.  ఇక వరద జలాలు ఆలయంలోకి చేరుకోవడంతో సప్త నదుల సంగమేశ్వరుడిని గంగమ్మ తాకి పరశించిపోతోంది..  దీంతో సంగమేశ్వరుడు గంగమ్మ ఒడిలోకి జారుకుంటున్న అపురూప దృశ్యం కనులవిందు చేస్తోంది. మరోపక్క పతిని తాకిని గంగమ్మ పరవశం పొందుతోంది. ఈ సతీపతుల సంగమానికి ఆలయ పురోహితుడు వేపదార శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అపురూపమైన అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ..చివరికి సముద్రంలో కలసిపోతాయి. ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేప లింగాన్ని సందర్శిస్తే.. నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చునని భక్తుల నమ్మకం. వాస్తవంగా సంగమేశ్వరాలయం ఈ ఏడాది మార్చి 21వ తేదీ శ్రీశైల జలాశయ కృష్ణా జలాల్లో నుండి బయటపడింది. తిరిగి ఇప్పుడు జులై 21వ తేదీ ఆలయం ప్రాంగణంలో నీళ్లు వచ్చి స్వామి గర్బలయంలోకి ప్రవేశించి.. వేపదారు శివలింగాన్ని తాకాయి. 122 రోజులు పాటు స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చాడు. మళ్ళీ స్వామి వారి దర్శనం కలగాలంటే 8 నెలలు వేచిచూడాలి భక్తులు.

ఈ సంగమేశ్వరాలయం ఆలయం విశేషం ఏమిటంటే..

గత ఏడాది జులై21 వ తేదీ గర్భాలయం లోకి నీరు ప్రవేశిస్తే, ఈసంవత్సరం కూడా సరిగ్గా జులై 21 వతేదీ రోజే కృష్ణా జలాలు సంగమేశ్వరున్ని తాకాయి. తొలి ఏకాదశి పుజల అనంతరం స్వామి వారికి ఈ సంవత్సరం చివరి పూజలు జరిపించారు అలయ అర్చకులు తెలకపల్లి రఘురాం శర్మ.ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుంటుంది. మరో విషయం ఏమిటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం బీముడు ప్రతిష్టించారు. వేపదారు శివలింగం అయిన ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. మొత్తంగా సంగమ తీరంలో గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఆలయం నీట మునిగిన అపురూప దృశ్యం తిలకించేందుకు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం గమనార్హం.

ఇది కూడా చదవండిః మళ్లీ లాక్ డౌన్ బాట..కరోనా కట్టడికి మరోసారి ఆంక్షలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement