Tuesday, April 23, 2024

మళ్లీ లాక్ డౌన్ బాట..కరోనా కట్టడికి మరోసారి ఆంక్షలు..

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి…మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కేసులు ఇప్పుడ క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన బాట పట్టాయి.. అంతేకాదు ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..దీంతో లాక్ డౌన్ విధించేందుకు కొన్ని రాష్ట్రాలు వెనకంజ వేయడం లేదు. కేరళలో కేసుల ఉధృతి పెరుగుతుండటంతో లాక్ డౌన్ విధించారు. కేరళలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24, 25 (శనివారం, ఆదివారం) తేదీల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు కరోనా టెస్టింగులను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. శుక్రవారం రోజున అదనంగా 3 లక్షల పరీక్షలు చేయాలని నిర్ణయించింది. పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

ఇది కూడా చదవండి : తెలంగాణలో నేటి నుంచి పెరగనున్న భూముల ధరలు..


Advertisement

తాజా వార్తలు

Advertisement