Thursday, May 2, 2024

ఛత్తీసగఢ్ లో మావోల ఘాతుకం

ఛత్తీసగఢ్​ లో మారోయిస్టులు రెచ్చిపోయారు. నారాయణ్​పుర్​ జిల్లా కన్హర్​గావ్​లో ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లా రిజర్వు గార్డు జవాన్లు వెళ్తున్న బస్సును ఐఈడీతో పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 15 మందికి స్వల్ప గాయాలైనట్లు ఛత్తీసగఢ్​​ డీజీపీ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది జవాన్లు ఉన్నట్లు వెల్లడించారు. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement