Friday, May 17, 2024

షర్మిలను కలిసిన మాజీ డీజీపీ భార్య

తెలంగాణలో పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ డీజీపీ స్వర్ణజిత్‌సేన్ భార్య అనిత మంగళవారం నాడు హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆమె షర్మిల పార్టీలో చేరతారా అన్న విషయంపై చర్చలు జరిగాయి. కానీ తాను కేవలం మర్యాదపూర్వకంగానే షర్మిలను కలిశానని, ప్రస్తుతానికి పార్టీలో చేరే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అనిత స్పష్టం చేశారు. కాగా దివంగత నేత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై 8న షర్మిల ఖమ్మం వేదికగా తన పార్టీ పేరును ప్రకటించనున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement