Saturday, May 4, 2024

ఏపీలో కొత్తగా 2100 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 72,731 సాంపిల్స్ ని పరీక్షించగా 2,100 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు,
ప్రకాశం లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు,శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు మరియు పశ్చిమ గోదావరి లో ఒక్కరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 3,435 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. అలాగే నేటి వరకు రాష్ట్రంలో 2,24,35,809 సాంపిల్స్ ని పరీక్షించారు.

మొత్తంపాజిటివ్ కేసుల సంఖ్య..1905023
యాక్టీవ్ కేసుల సంఖ్య…33964
డిశ్చార్జ్ అయినవారి సంఖ్య…1858189
మొత్తం మరణాల సంఖ్య…12870

Advertisement

తాజా వార్తలు

Advertisement