Wednesday, May 15, 2024

షాకింగ్: భార్యే సవతి తల్లిగా మారింది..

తన మాజీ భార్య తనకు సవతి తల్లిగా మారిందని తెలుసుకుని నివ్వెరపోయాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి. సదరు యువకుడు 2016లోనే వివాహం చేసుకున్నాడు. అయితే ఆ సమయానికి వారిద్దరూ మైనర్లు. పెళ్లైన ఆరు నెలలకే ఆ యువకుడిని ఆ యువతి వదిలేసింది. రాజీకోసం యువకుడు ఎంతగా ప్రయత్నించినా ఆమె అంగీకరించకుండా దూరంగా వెళ్లిపోయింది. అది జరిగిన కొంత కాలానికి ఆ యువకుడి తండ్రి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆయన ఆచూకీ కోసం గాలించిన యువకుడు ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన అధికారులు ఆ యువకుడికి షాకింగ్ విషయం చెప్పారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆ వ్యక్తి.. తన మాజీ కోడల్ని వివాహం చేసుకుని, ఆమెతో కలిసి జీవిస్తున్నట్టు తెలిపారు. చివరకు తనను వదిలేసిన మహిళనే తండ్రి పెళ్లి చేసుకున్నాడని తెలిసి నిర్ఘాంతపోయాడు ఆ యువకుడు.

సమాచార హక్కు చట్టం ద్వారా ఆ విషయం తెలుసుకుని షాకై పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ప్రస్తుతం తండ్రీకొడుకుల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన తండ్రి ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ యూపీలోని బదాయ్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల జిల్లా పంచాయతీ రాజ్ అధికారికి ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు చేశాడు. తన మాజీ భార్యను తండ్రి (48) వివాహం చేసుకుని సంభల్‌ ప్రాంతంలో కలిసి జీవిస్తున్నాడని తెలుసుకుని వారిపై ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముగ్గురినీ స్టేషన్‌కు పిలిపించి రాజీకి ప్రయత్నించారు. తాను రెండో భర్తతోనే సంతోషంగా ఉన్నానని, మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని ఆ మహిళ తేల్చి చెప్పింది. మైనర్లుగా ఉన్నప్పుడే వివాహం జరగడం వల్ల మొదటి వివాహానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవనీ, అందుకే కేసు నమోదు చేయలేదని, ఇరు వర్గాలకూ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని బదాయ్ సర్కిల్ ఆఫీసర్ వినయ్ చౌహన్ అన్నారు.

ఇది కూడా చదవండి: శివసేన, బీజేపీ మళ్లీ కలిసే అవకాశం ఉందా?

Advertisement

తాజా వార్తలు

Advertisement