Thursday, April 25, 2024

రేవంత్ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే వారెవ‌రూ లేరు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌంటర్

పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలన్నతెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి రేవంత్ కామెంట్లను తిప్పి కొట్టారు. త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను రేవంత్ హింస వైపు ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అల్ల‌క‌ల్లోలం సృష్టించేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ పిల్లి కూత‌ల‌కు, బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే వాళ్లు ఎవ‌రూ లేరన్నారు. రెచ్చ‌గొట్టే రాజ‌కీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన‌ప్పుడు రేవంత్ రెడ్డి స్పీక‌ర్‌కు ఎందుకు రాజీనామా లేఖ ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి నోరు జారి, దిగ‌జారుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేద‌ని సుధీర్ రెడ్డి హెచ్చ‌రించారు. ఎంపీగా గెలిచిన త‌ర్వాత మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌రోజైనా ప‌ర్య‌టించావా? అని ప్ర‌శ్నించారు. క‌రోనాకు భ‌య‌ప‌డి ఇంట్లో దాక్కున్న వ్య‌క్తి రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement