బిహార్లో దారుణం జరిగింది. 20 ఏళ్ల దళిత యువతిపై కొంతమంది దుండగులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల పాటు ఆ యువతిపై లైంగిక దాడి చేసి దారుణంగా హతమార్చారు. తిసియోటా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ చెరువులో 20 ఏళ్ల యువతి డెడ్బాడీ తేలుతూ కనిపించింది. కాల్వలో పాక్షికంగా నగ్న స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
పోస్టుమార్టం జరిపేందుకు హాజీపూర్లోని ఆస్పత్రికి ఆ యువతి మృతదేహాన్ని తరలించారు పోలీసులు. కాగా, మృతురాలి తల్లి తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరగింది అని.. అనురాగ్ కుమార్, రాకేష్ కుమార్, మనోజ్ చౌదరి ఇంక అదే పట్టణానికి చెందిన మరో ఆరుగురు యువకులపై పోలీసులకు కంప్లెయింట్ చేసింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital