Thursday, April 25, 2024

Covid -19: ఏపీలో కొత్తగా కరోనా కేసులు ఎన్నంటే..

ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కేసులు పెగుతున్న వేళ.. కోవిడ్ కేసులు మాత్రం తగ్గుతున్నాయి. గడిచి 24 గంటల్లో 31,743 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 162 కొత్త కేసులు నమోదైయ్యాయి. అదేసమయంలో 186 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎలాంటి మరణం సంభవించలేదని వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,76,849కి చేరింది. ఇందులో 20,61,308 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1049 కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14,492 మంది కరోనాతో మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement