Wednesday, May 8, 2024

దేశంలో కొత్తగా 16,678 కరోనా కేసులు.. 24 గంటల్లో 26 మంది మృతి

దేశంలో కొత్తగా 16,678 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,83,162 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది మరణించారు. పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో యాక్టివ్‌ కేసులు 1,50,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది వైరస్‌కు బలవగా, 14,629 మంది డిశ్చార్జి అయ్యారు.
ఇక రోజు వారీ పాజిటివిటీ రేటు 5.99 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 198.88 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ చేశామని ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement