Tuesday, April 30, 2024

తెలంగాణ‌లో కొత్తగా 108 కరోనా కేసులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో 108 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 116 మంది తాజాగా కోలుకున్నారు. కరోనా బారిన పడిన వారిలో 99.42శాతం మంది కోలుకుంటున్నారు. కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 718గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 10613 మందికి కరోనా టెస్టులు చేశారు. హైదరాబాద్‌లో 47, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 8 , రంగారెడ్డిలో 9 చొప్పున అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement