Friday, April 26, 2024

Delhi: ఆతిథ్య రంగానికి అద్భుత భవిష్యత్.. ఐహెచ్ఎమ్-పుసా వజ్రోత్సవాల్లో కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలో అత్యుత్తమ ఆతిథ్య దేశంగా భారతదేశం ఎదగాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక,ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఐహెచ్ఎం-పూసా వజ్రోత్సవ కార్యక్రామానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనానంతర పరిస్థితుల్లో భారత పర్యాటక, ఆతిథ్య రంగం మళ్లీ ప్రగతి బాట పట్టిందని, ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే భారతదేశం విదేశీ పర్యాటకు ఆకర్షించే విషయంలో ముందు వరసలో ఉందన్నారు.

ఒక సంస్థ 60 ఏళ్లు పూర్తిచేసుకోవడం గొప్ప విషయమన్న ఆయన, ఈ సంస్థలో హోటల్ మేనేజ్మెంట్ శిక్షణ పొందిన వారు దేశ, విదేశాల్లో ఆతిథ్య రంగంలో రాణిస్తుండటం మనందరికీ గర్వకారణమన్నారు. సేవారంగం దూసుకుపోతున్న తరుణంలో.. అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య శిక్షణను అందిస్తూ రేపటి భారత ఆతిథ్య రంగం అంబాసిడర్లుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఇందుకోసం కొత్త సాంకేతికతను, అంతర్జాతీయంగా ఉత్తమ పద్ధతులను అలవర్చుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement