Sunday, May 19, 2024

ఇంటర్‌ వొకేషనల్‌ విద్యార్థులకు వంద శాతం సిలబస్‌

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్‌ ఒకేషన్‌ వార్షిక పరీక్షల్లో వందశాతం సిలబస్‌ ఉండనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం 22 కోర్సుల్లో ఈసారి వంద శాతం సిలబస్‌కు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. థియరీ, ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తి సిలబస్‌తో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్‌ రెగ్యులర్‌ విద్యార్థులకు కూడా వంద శాతం సిలబస్‌ ఉండనుందని ఇప్పటికే ఇంటర్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement