Thursday, May 16, 2024

Terror Attack: 10మంది పాక్ సైనికులు మృతి.. ఒక తీవ్రవాది హతం..​

పాకిస్తాన్​లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్ లో టెర్రరిస్టులు అటాక్​ చేశారు. కెచ్ జిల్లాలో భద్రతా దళాల చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 1‌‌‌‌0 మంది పాక్ సైనికులు మరణించారని సైన్యం తెలిపింది. జనవరి 25-26వ తేదీల్లో రాత్రి టెర్రరిస్టుల “ఫైర్ రైడ్” జరిగిందని మిలిటరీ మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది. తీవ్రమైన ఎదురుకాల్పుల్లో 10 మంది పాక్​ సైనికులు మరణించారని పేర్కొంది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమవ్వగా.. పలువురు గాయపడ్డారని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement