Sunday, May 12, 2024

హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 163 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,97,113 కి చేరింది. అదే సమయంలో కరోనా కారణంగా  ఇద్దరు మృత్యు ఒడికి చేరారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,622కు చేరింది.  రాష్ట్రంలో ప్రత్తుతం  1,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement