Wednesday, May 15, 2024

సుశాంత్ కేసులో 12వేల పేజీలతో ఛార్జిషీట్

దేశవ్యాప్తంగా బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అతడి మృతికి కారణమైన డ్రగ్స్ కేసుకు సంబంధించి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో 33 మంది పేర్లతో 12 వేల పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 200 మంది వాంగ్మూలాలను ఇందులో పొందుపరిచింది. ఇందులో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కేసుతో లింక్ ఉన్న రియాను గత ఏడాది సెప్టెంబరులో అరెస్ట్ చేశారు. రియా సోదరుడు శౌవిక్‌ను కూడా అరెస్ట్ చేసి విచారణ అనంతరం బెయిల్‌పై వదిలిపెట్టారు. కాగా ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు 200 మంది సాక్షులను విచారించిన అధికారులు… 34 మందిని అరెస్ట్ చేశారు. పలువురు బాలీవుడ్ అగ్రనటులు, దర్శకులు, నిర్మాతల హస్తం కూడా డ్రగ్స్ కేసులో ఉన్నట్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement