Saturday, May 4, 2024

సోషల్‌ మీడియాలో గిర్రున తిరుగుతున్న కరణ్‌ జోహార్‌ డ్రెస్


బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు కరణ్‌ జోహార్‌ వేసుకున్న ఓ డ్రెస్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా తాజాగా తన ఇంట్లో ఇచ్చిన పార్టీకి అటెండయ్యాడు కరణ్‌. అయితే ఆ పార్టీకి మనీష్‌ డిజైన్‌ చేసిన పేపర్‌ డ్రెస్‌ వేసుకున్నాడు. న్యూస్‌ పేపర్‌ ప్రింట్‌లా ఉన్న షర్టుతో పాటు బ్లాక్‌ ట్రాక్‌ వేసుకున్నాడు కరణ్‌.‌ డిఫరెంట్‌ డ్రెస్‌ వేసుకున్న కరణ్‌‌ను నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. కరణ్‌ తో పాటుగా కరీష్మా కపూర్‌, మలైకా ఆరోరా, అమృత అరోరా, గౌరీ ఖాన్‌ ఈ పార్టీకి హాజరయ్యారు.

గతంలో ను కొంతమంది హాలీవుడ్‌ సెలబ్రిటీలు ఇలా పేపర్‌ డ్రెస్‌లో మెరిసిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement