Wednesday, May 8, 2024

వైసీపీ ఎంపీలను గంగిరెద్దులతో పోల్చిన నారా లోకేష్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం అమ్మేస్తుంటే.. జగన్ దానిని కొంటున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవడం చేతకాని వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓకే సార్ అంటూ గంగిరెద్దుల్లా తల ఆడించడానికి 23 మంది ఎంపీలు ఎందుకు దండగ అని మండిపడ్డారు. విశాఖ ఉక్కును తుక్కులా కొట్టేయడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము అడ్డుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. జగన్ అంగీకారంతోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం అమ్మేస్తుందని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పేరుతో జగన్ లేఖలతో కాలక్షేపం చేస్తున్నారని.. ఇప్పటికైనా వైసీపీ నేతలు డ్రామాలు ఆపాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement