Friday, April 26, 2024

వామనరావు దంపతుల హత్య కేసు నిందితుడు బిట్టు వరంగల్ జైలుకి తరలింపు..

వరంగల్ – కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన న్యాయవాద దంపతులు వామన్‌రావు-నాగమణి హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీనును పోలీసులు నేడు వరంగల్‌ జైలుకు తరలించారు. హత్య కేసులో అతడిని ఏడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఇవ్వగా.. నేడు గడువు ముగియడంతో పోలీసులు మంథని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు బిట్టు శ్రీనుకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు శ్రీనును వరంగల్‌ జైలుకు తరలించారు. దంపతుల కేసుల హత్య కేసులో బిట్టు శ్రీను ఏ4 నిందితుడిగా ఉన్నాడు. నిందితులకు మారణాయుధాలు, వాహనం సమకూర్చడంతో పాటు, కుంట శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక వేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement