Saturday, May 11, 2024

వీల్ చైర్ లో ప్రచారానికి సిద్ధం…దట్ ఈజ్ మమత

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నందిగ్రామ్ లో జరిగిన దాడిలో మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆస్పత్రి నుంచి మమతా బెనర్జీ కార్యకర్తలకు ఓ వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని వీల్ చైర్ లో ప్రచారంలో పాల్గొంటానని మమతా బెనర్జీ తెలిపారు. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో నా కాలు కారు డోర్ లో ఇరుక్కుపోయింది. ప్రస్తుతం చికిత్స జరుగుతుంది.ఇంకో రెండు మూడు వారాల్లో బయటకు వస్తా. నా షెడ్యూల్ యధావిధి గానే ఉంటుంది. మార్పేమి ఉండదని మమత తెలిపారు.

మీ మద్దతు ఎప్పుడూ నాకు కావాలి. అందరూ శాంతియుతంగానే ఉండండి. సంయమనం పాటించండి. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ పని చేయకండి అంటూ మమతా బెనర్జీ వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement