Friday, April 26, 2024

మొతేరా : పెవిలియన్ కు క్యూ కట్టిన ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్: ప్రస్తుతం స్కోరు 93/7

భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ మూడో టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్  తొలి ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ల ధాటికి కకావికలైపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ కడపటి వార్తలందేసరికి 7వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ క్రావ్లీ హాఫ్ సెంచరీ మినహా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ ఎవరూ నిలదొక్కుకోలేదు. జాక్ క్రావ్లీ 84 బంతుల్లో పది ఫోర్లతో 53 పరుగులు చేసిన అక్షర్ పటేల్ బౌలింగ్ లో లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు. సిబ్లి, బ్రెయిన్ స్ట్రోలు డకౌట్ అయ్యారు. రూట్ 17 పరుగులకే అశ్విన్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. బెన్ స్టోక్స్, ఆర్చర్, ఒల్లిపోప్ సింగిల్ డిజిట్ స్కోరు దాటలేదు. భారత బౌలర్లలో ఇషాంత్ ఒక వికెట్ పడగొట్టగా, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement