Thursday, March 28, 2024

‘ఎన్టీఆర్’ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరుడు

మళ్లీ బుల్లితెరపై సందడి చేయనున్నాడు స్టార్ హీరో ఎన్టీఆర్. ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రొగ్రాంకి  హోస్ట్ గా మారనున్నాడట. నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ నే మార్చి ఈ ప్రోగ్రామ్ ని సిద్ధం చేస్తున్నారట. అన్నపూర్ణ 7ఎకరాస్ లో ఈ ప్రోగాంకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా జరుగుతోందట. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ షూట్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అంతేకాదు  మూడు నాలుగు రోజుల్లో ఈ ప్రోమో షూట్ పూర్తి కానుంది. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌ బాగా ప్రజాదరణ పొందడంతో దాన్ని కాస్త మార్చి ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ తీసుకొస్తున్నారు. మార్చి తొలివారం నుంచి ఈ షోకి సంబంధించి ఎంట్రీస్ తీసుకుంటారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతుంది. తన సినిమాలతో పాటు ఈ షోకు కూడా డేట్స్ ఇచ్చేసాడు జూనియర్.  ఒక్కో ఎపిసోడ్ కోసం కోటికి పైగానే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు తారక్. కరోనా కారణంగా గతేడాదే మొదలవ్వాల్సిన ఈ షో ఇప్పుడు బయటికి వస్తుంది. ఎంటర్‌టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ షోను ఎంతవరకు సక్సెస్ చేస్తాడో చూడాలిక.

Advertisement

తాజా వార్తలు

Advertisement