Saturday, April 27, 2024

పెద్దపల్లి : పథకం ప్రకారమే వామనరావు హత్య : రిమాండ్ రిపోర్టులో పోలీసులు

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసు  రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కుంట శీను, చిరంజీవి ఇద్దరూ పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను హతమార్చినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. హత్య చేసిన తర్వాత నిందితులు రామగిరి నుంచి మహరాష్ట్రకు పరారయినట్లు పోలీసులు గుర్తించారు.  సుందిళ్ల బ్యారేజ్‌లో కత్తులు, బట్టలు పడేసినట్టు లీసు  పేర్కొన్నారు.   సుందిళ్ల బ్యారేజ్‌ దగ్గరే వేరే బట్టలు మార్చుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. న్యాయవాది వామన్‌రావుకు సంబంధించిన సమాచారాన్ని లచ్చయ్య ఎప్పటికప్పుడు కుంట శీనుకు అందించేవాడని,  హత్యకు వినియోగించిన కత్తులు, వాహనం బిట్టు శీను సమకూర్చాడని పోలీసులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు పేర్కొన్న పోలీసులు.. మరో ఇద్దరు నిందితులు కుంట శ్రీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement