Sunday, April 28, 2024

హైదరాబాద్ : మేయర్ గా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

: జీహెచ్‌ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఈ రోజు  బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఈ  కార్యక్రమానికి హాజరైన కార్పొరేటర్లు, అధికారులు కొత్త మేయర్‌ కు అభినందనలు ‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో   ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement