Sunday, April 28, 2024

పలు యూనివర్సిటీలకు ప్రవేశ పరీక్షల బాధ్యతలు

ఏపీలోని ఉన్నత విద్యాసంస్థల్లో నిర్వహించే ప్రవేశ పరీక్షల బాధ్యతలను పలు యూనివర్సిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ ప్రవేశపరీక్ష నిర్వహణను కాకినాడ జేఎన్టీయూకు, ఈసెట్ ప్రవేశపరీక్ష నిర్వహణను అనంతపురం జేఎన్టీయూకు, ఐసెట్ ప్రవేశపరీక్ష నిర్వహణను విశాఖ ఏయూకు, పీజీ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహణను తిరుపతిలోని ఎస్వీయూకు, లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహణను తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీకి, ఎడ్‌సెట్ ప్రవేశపరీక్ష నిర్వహణను విశాఖలోని ఏయూకు, ఆర్క్ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహణను విశాఖలోని ఏయూకి ప్రభుత్వం అప్పగించింది. కాగా ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement