Saturday, May 4, 2024

న్యూఢిల్లీ : విభజన హామీల సంగతేంటి?: గల్లా జయదేవ్

విభజన హామీల సంగతేమైందని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. లోక్ సభలో బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న ఆయన ఏపీ పునర్వ్వవస్థీకరణ చట్టం సందర్భంగా ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారరు. నాటి హామీల్లో  18 అంశాలు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. .వనరుల అంతరాన్ని పూడ్చడం,  పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ ఏర్పాటు, అమరావతికి కేంద్ర సాయం, పెట్రో కెమికల్ కాంప్లెక్సులో గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైలు వ్యవస్థలు, అమరావతికి వేగవంతమైన రైలు, రహదారుల సంధానత, వెనుకబడిన జిల్లాలకు ఆర్థికసాయం, వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ స్థాపన,  తదితర అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదని గల్లా జయదేవ్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement